- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అడవిపందిని చంపిన నిందితులకు షాకిచ్చిన పోలీసులు
X
దిశ, మంగపేట: అడవి పందిని చంపి అమ్ముతున్న మండలంలోని కమలాపురంకు చెందిన కొలిమి రమేష్, కత్తుల భీముడు, బోయ సంపత్ లపై కేసు నమోదు చేసి వారికి రూ.50 వేల జరిమానా విధించినట్లు రేంజి అధికారులు షకిల్ పాషా, కోటేశ్వర్ లు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగపేట మండలంలోని కమలాపురం శివారు హనుమాన్ టెంపుల్ సమీప అడవిలో కొలిమి రమేష్, కత్తుల భీముడు, బోయ సంపత్ లు అడవి పందిని చంపి విక్రయిస్తున్నట్లు సెప్టెంబర్ 29న అటవీ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు దాడి చేసి నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి జిల్లా ఫారెస్టు అధికారికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల విచారణ అనంతరం నిందితులైన కొలిమి రమేష్, కత్తుల భీముడు, బోయ సంపత్ లపై కేసు నమోదు చేసి రూ.50 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.
Advertisement
Next Story