కాకా విగ్రహానికి ప్రముఖుల నివాళులు

by Y. Venkata Narasimha Reddy |
కాకా విగ్రహానికి ప్రముఖుల నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర మాజీ మంత్రి గడ్డంవెంకటస్వామి(కాకా) 95 వ జయంతి సందర్బంగా ట్యాంక్ బండ్ వద్ద కాకా విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, మాజీ మంత్రి కె.జానారెడ్డి, సీనియర్ నాయకులు కె.కేశవరావు, శంకర్ రావు, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభృతులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కాకా జయంతిని ప్రభుత్వంగా అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాకా అందించిన సేవలు చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed