రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మరణంపై స్పందించిన పవన్, జూనియర్ ఎన్టీఆర్

by karthikeya |   ( Updated:2024-10-05 06:12:19.0  )
రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మరణంపై స్పందించిన పవన్, జూనియర్ ఎన్టీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి (38) శుక్రవారం నాడు హార్ట్‌ఎటాక్‌తో మరణించడంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నీరవుతుండగా.. పలువురు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయార్ రాజేంద్ర ప్రసాద్‌కు తలమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను’’ అంటూ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సానుభూతిని ప్రకటించారు.

అలాగే మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ‘‘నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అంటూ పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed