Telugu Crime News : ఘోరం.. బైక్ ఢీకొని వ్యక్తి మృతి

by Kavitha |   ( Updated:2024-10-05 06:12:56.0  )
Telugu Crime News : ఘోరం.. బైక్ ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, మేడ్చల్ టౌన్: బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున మునిరాబాద్ నుండి కండ్లకోయ వైపు ఇద్దరు వ్యక్తులు సర్వీస్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి మునిరాబాద్‌కు చెందిన అనంత కుమార్ బైక్ ఢీ కొట్టింది. దీంతో అలహాబాద్‌కు చెందిన జగదీష్ కిందపడి తలకు బలమైన గాయం అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed