మంత్రి నాని, అంబటి, వంశీ వల్ల జగన్‌కు CM పదవి పోవచ్చు : YCP నేత షాకింగ్ కామెంట్స్

by Anukaran |
మంత్రి నాని, అంబటి, వంశీ వల్ల జగన్‌కు CM పదవి పోవచ్చు : YCP నేత షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీ మంత్రి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీపై సొంత పార్టీ నేత సోమిశెట్టి సుబ్బారావు సంచలన కామెంట్స్ చేశారు. వీరి వల్ల వైసీపీకి, సీఎం జగన్‌కు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వీరు వైసీపీకి మంచి జరగాలని చూస్తున్నారో లేక శత్రువులో అర్థం కావడంలేదని అన్నారు. సదరు మంత్రుల వల్ల వైసీపీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని, పార్టీకి 20 శాతం ఓట్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా వీరు తమ పద్దతి మార్చుకోవాలని సూచించారు. కొందరి తీరును చూస్తుంటే కోవర్టు ఆపరేషన్‌లా అనిపిస్తోందన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని విస్మరిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలతో వెంబడించి కొడతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో మంత్రులు ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు.

వీరి విషయంలో సీఎం జగన్‌ చొరవతీసుకోకుంటే పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని సుబ్బారావు అన్నారు. మంత్రి బాలినేని జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సోమిశెట్టి వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed