కుటుంబ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

by Aamani |
కుటుంబ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్
X

దిశ,కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియ గురువారం జిల్లాలో ప్రారంభమైంది.డిజిటల్ కార్డు సర్వేలో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి సర్వేలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ డిజిటల్ కార్డు జారీ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా జిల్లాలో ఏడు గ్రామాలు, మూడు మున్సిపాలిటీ ల లోని వార్డులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం లాల్ తండా పంచాయతీలో 171 కుటుంబాలు, పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో 330 కుటుంబాలు, దమ్మపేట మండలం ఆళ్లపల్లి పంచాయతీలోని 175 కుటుంబాలు, ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో 178 కుటుంబాలు, అశ్వాపురం మండలం అశ్వాపురం మండలం చందర్లపాడు పంచాయతీ లోని 190 కుటుంబాలు, మణుగూరు మున్సిపాలిటీ లోని ఆరవ వార్డులో 248 కుటుంబాలు, చర్ల మండలం పులి గుండాల గ్రామంలో 190 కుటుంబాలు, భద్రాచలం గ్రామ పంచాయతీ లోని 9వ వార్డులో 280 కుటుంబాలు, దమ్మపేట మండలం ఆళ్లపల్లి గ్రామంలోని 175 కుటుంబాలు, ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలోని 178 కుటుంబాలు, ఇల్లందు మండలం పూబెల్లి పంచాయతీ లోని 172 కుటుంబాలు మరియు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులో 310 కుటుంబాలకు ఈ కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

కుటుంబ డిజిటల్ కార్డు లో కుటుంబ వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వేలో కుటుంబ సభ్యుల పేర్లు, పుట్టిన తేదీ, యజమానితో గల సంబంధం తదితర వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులకు తెలిపారు.అదేవిధంగా కుటుంబంలో చనిపోయిన, వివాహం చేసుకొని వెళ్లిన వారి వివరాలను తొలగించాలని అదేవిధంగా కొత్తగా వివాహమై కుటుంబంలోకి వచ్చిన వివరాలను, పిల్లల వివరాలను నమోదు చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతితో గ్రూప్ ఫోటో పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. ఈ సర్వేలో అదనపు కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తాసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్వేలో భాగంగా ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తేవాలని అధికారులను ఆదేశించారు.

Next Story