- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Nigeria : ముంచెత్తిన వరదలు.. 179 మంది మృతి.. నిరాశ్రయులైన 2 లక్షల మంది
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : నైజీరియాలోని ఉత్తర ప్రాంతం వరదలతో చిగురుటాకులా వణికిపోతోంది. వరదలు, భారీ వర్షాల వల్ల సంభవించిన వేర్వేరు ఘటనల్లో 179 మంది చనిపోయారు. దాదాపు 2లక్షల మందికిపైగా ప్రజలు వరదల వల్ల నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం వారంతా తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
దాదాపు 1.07 లక్షల హెక్టార్లలో పంటనష్టం సంభవించింది. ఈవివరాలను నైజీరియా ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని తెలిపాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించాయి.
Advertisement
Next Story