Nigeria : ముంచెత్తిన వరదలు.. 179 మంది మృతి.. నిరాశ్రయులైన 2 లక్షల మంది

by Hajipasha |
Nigeria : ముంచెత్తిన వరదలు.. 179 మంది మృతి.. నిరాశ్రయులైన 2 లక్షల మంది
X

దిశ, నేషనల్ బ్యూరో : నైజీరియాలోని ఉత్తర ప్రాంతం వరదలతో చిగురుటాకులా వణికిపోతోంది. వరదలు, భారీ వర్షాల వల్ల సంభవించిన వేర్వేరు ఘటనల్లో 179 మంది చనిపోయారు. దాదాపు 2లక్షల మందికిపైగా ప్రజలు వరదల వల్ల నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం వారంతా తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.

దాదాపు 1.07 లక్షల హెక్టార్లలో పంటనష్టం సంభవించింది. ఈవివరాలను నైజీరియా ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని తెలిపాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed