'ఆత్మాహుతి దాడుల వెనుక భారత్'.. పాక్ మంత్రి సంచలన కామెంట్స్

by Vinod kumar |
ఆత్మాహుతి దాడుల వెనుక భారత్.. పాక్ మంత్రి సంచలన కామెంట్స్
X

ఇస్లామాబాద్ : భారత నిఘా సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌)పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు చేసింది. గత శుక్రవారం బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని మస్తాంగ్‌ ఏరియాలో ఉన్న మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి ఘటన వెనుక ‘రా’ హస్తం ఉందని పాకిస్థాన్‌ హోంశాఖ మంత్రి సర్ఫరాజ్‌ బుగ్తీ వ్యాఖ్యానించారు. ఈ సూసైడ్ ఎటాక్ వెనుక ఉన్న శక్తులను పాక్ పౌర, సైనిక, నిఘా సంస్థలు కలిసికట్టుగా ఎదుర్కొంటాయని వెల్లడించారు.

అయితే ‘రా’పై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా..? లేదా..? అనే వివరాలను బుగ్తీ బహిర్గతం చేయలేదు. దాదాపు 60 మంది చనిపోయిన ఈ ఆత్మాహుతి దాడి ఘటనలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా పాక్ పోలీసులు అరెస్టు చేయలేదు. గత కొన్ని నెలలుగా పాక్‌లో జరిగిన ఉగ్రదాడులకు తెహ్రీకే తాలిబన్‌ సంస్థ బాధ్యత వహించింది. ఇది కూడా ఆ సంస్థ పనేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed