- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Muizzu: తాజ్ మహల్ అద్బుతం.. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
by vinod kumar |
X
దిశ, నేషనల్ బ్యూరో: భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తన భార్య సాజిదా మహమ్మద్తో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ను సందర్శించారు. ఆగ్రాలోని టెక్నికల్ ఎయిర్పోర్టులో దిగిన ఆయనకు ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ స్వాగతం పలికారు. సుమారు గంట సేపు తాజ్ మహల్ వద్ద గడిపారు. ముయిజ్జు పర్యటన నేపథ్యంలో రెండు గంటల పాటు సందర్శకులను నిలిపివేశారు. ‘ఈ కట్టడం అందాన్ని వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే ఎన్ని పదాలు ఉపయోగించినా దానికి న్యాయం చేయలేవు. ప్రతి ఒక్కరినీ మంత్ర ముగ్ధులను చేసే ఈ కట్టడం ప్రేమ, నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. ఈ స్మారక చిహ్నం నిజంగా కలకాలం నిలిచిపోయే కళాఖండం’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. కాగా, ముయిజ్జు భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సమావేశమై వివిధ ఒప్పందాలపై సంతకం చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story