బద్దలైన డ్యాం.. వందల మంది గల్లంతు

by M.Rajitha |
బద్దలైన డ్యాం.. వందల మంది గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్ : సూడాన్ దేశంలో ఓ డ్యాం తెగిపోయి వందల మంది అదృశ్యమయ్యారు. తూర్పు సూడాన్ లోని రెడ్ సీ రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల అన్ని ప్రాంతాల్లో వరద బీభత్సాన్ని సృష్టించింది. వరదల ధాటికి తట్టుకోలేక అర్బాత్ డ్యామ్ ఒక్కసారిగా కొట్టుకుపోయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలను భారీగా నీరు ముంచెత్తింది. సుమారు నలుగురు మరణించారని, 60 మంది వరకు గల్లంతయ్యారని అధికారులు తెలిపినప్పటికీ.. అక్కడి స్థానిక మీడియా కథనాల ప్రకారం డ్యాం కొట్టుకు పోవడం వల్ల వందల మంది మరణించారని, మరికొన్ని వందల మంది గల్లంతయ్యారని వెల్లడించింది. ఈ ఘటనలో అధిక మొత్తంలోనే ఆస్తి, ప్రాణ నష్టం ఉండవచ్చని నీటి పారుదల అధికారులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed