కోడలు తిరిగిరావాలని.. నాలుక కోసుకున్న అత్త!

by Anukaran |
కోడలు తిరిగిరావాలని.. నాలుక కోసుకున్న అత్త!
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని కొన్ని రాష్ట్రాలు విద్యాపరంగా చాలా వెనుకబడ్డాయి. అలాంటి ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. వాటిని నమ్మిన ప్రజలు వాళ్ల ప్రాణాలు తీసుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జార్ఘండ్ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మూఢనమ్మకంతో ఓ మహిళ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. తన నాలుకను కత్తిరించి దేవుడికి మొక్కుగా సమర్పించింది. కారణం.. ఇటీవల తన కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆమె ఈ పిచ్చి పని చేసిందని తెలుస్తోంది. నాలుకను కట్ చేసుకున్న సమయంలో తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇంట్లో వారు బలవంతం చేసిన వినిపించుకోలేదు. చివరకు ఆమెను జంషెడ్పూర్‌‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో బాధితురాలు లక్ష్మి నిరల క్రమంగా కోలుకుంటున్నట్లు సమాచారం.

పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌లోని సెరైకెలా ఖర్‌సవాన్ జిల్లాలోని ఎన్ఐటీ క్యాంపస్‌లో లక్ష్మి నిరల అనే మహిళ ఇంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కోడలు జ్యోతి, తన బిడ్డతో కలిసి ఈ నెల 14న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తన కోడలు తిరిగి రావాలంటూ నిరల ఇంట్లో శివుడికి పూజలు చేయడం మొదలుపెట్టింది. కోడలు, బిడ్డ క్షేమంగా ఇంటికి చేరేలా చూడాలని వేడుకుంటూ బ్లేడ్‌తో తన నాలుకను కోసి దేవుడికి మొక్కు సమర్పించుకుంది.

మీ కోడలు క్షేమంగా తిరికి రావాలంటే ఇలా చేయాలని స్థానిక మాంత్రికుడు ఎవరో సలహా ఇవ్వడంతోనే నిరల అలా చేసినట్లు ఆమె భర్త నందులాల్ ఆవేదన వ్యక్తంచేశాడు. శుక్రవారం నుంచి వెతుకుతున్నా జ్యోతి ఆచూకీ లభ్యంకాలేదని వివరించాడు. జ్యోతి కనిపించకుండా పోయిన విషయంపై తాను, తన కుమారుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం లక్ష్మి తన నాలుకను కోసి దేవుడికి సమర్పించినట్లు వెల్లడించాడు.

Advertisement

Next Story

Most Viewed