నిర్మల్‌లో ఇద్దరు యువకులు దుర్మరణం

by  |
నిర్మల్‌లో ఇద్దరు యువకులు దుర్మరణం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ వద్ద గురువారం నిర్మల్ నుండి భైంసాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అటువైపుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దిలవార్ పూర్ గ్రామానికి చెందిన రాహిల్(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా… ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నేమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed