ఎదురెదురుగా ఢీకొన్న కారు-లారీ.. ఇద్దరు మృతి

by srinivas |   ( Updated:2021-08-20 22:14:53.0  )
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు ఏలూరు వాసులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed