టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో యంగ్ డైరెక్టర్ మృతి

by vinod kumar |
director Vatti Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే అనేకమంది నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలకు వైరస్ బారినపడగా, రోజుకొకరు పరిస్థితి విషమించి మృతిచెందుతున్నారు. తాజాగా.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి(39) కరోనాతో పోరాడి ఓడిన కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 2017లో ‘మా అబ్బాయి’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీతోనే కుమార్ వట్టి దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. పరుశురాం దగ్గర ‘యువత’ సినిమా అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ తర్వాత ‘సోలో’ సినిమాకు కూడా పనిచేశారు. దీంతో కుమార్ వట్టి మృతితో పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు.

Advertisement

Next Story