ముగ్గురు అక్కలపై కత్తితో దాడి చేసిన తమ్ముడు

by  |
ముగ్గురు అక్కలపై కత్తితో దాడి చేసిన తమ్ముడు
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రాయణగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు అక్కలు, బావపై సొంత తమ్ముడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి సోమవారం రాత్రి తన ఇంటికి వచ్చిన ముగ్గురు అక్కలపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన బావపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో మహిళ, వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు గతేడాది తన భార్యను కూడా ఇదేవిధంగా కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపినట్లు సమాచారం.


Next Story

Most Viewed