కన్న కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి

by Disha Web Desk 23 |
కన్న కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి
X

దిశ,కరీంనగర్ రూరల్: కళ్లల్లో కారం పొడి చల్లి, తలపై రోకలి బండతో కొట్టి కన్న కొడుకును కడతేర్చిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చింతకుంట గ్రామానికి చెందిన పెరుమాళ్ళ శివ సాయి (21) హైదరాబాదులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఇంట్లో శుభకార్యానికి వచ్చిన శివ సాయి ని కన్నతండ్రి పెరుమండ్ల శ్రీనివాస్ (50) శుక్రవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో కళ్ళల్లో కారం పొడి చల్లి,రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి ఉపాధి హామీ పనికి వెళ్లగా కొడుకు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం నిందితుడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story