Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!!

by Anjali |
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!!
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా పలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిజామాబాద్‌, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి భారీ వానలు పడనున్నాయని వెల్లడించింది. అప్పుడప్పుడు ఎండగా అనిపించినా.. సాయంత్రం లోపు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఏపీలో రాలయసీమపై అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే .. గరిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed