‘ఆ అర్హతే లేదు’.. కేటీఆర్‌పై మాజీ MP మధుయాష్కీ గౌడ్ ఫైర్

by Satheesh |   ( Updated:2024-07-09 17:38:19.0  )
‘ఆ అర్హతే లేదు’.. కేటీఆర్‌పై మాజీ MP మధుయాష్కీ గౌడ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేనే లేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు మీ నీతి ఏమైందని కేటీఆర్‌ను నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల నుండే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని రెచ్చగొట్టింది మీరే కదా.. మరీ మీరు ప్రభుత్వాన్ని కూలగొడుతుంటే చూస్తూ కూర్చోవాలా అని చురకలంటించారు. పార్టీ పేరు నుండి తెలంగాణ అనే పదం తొలగించినప్పుడే బీఆర్ఎస్ పార్టీ పతనం మొదలైందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed