జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నగలుగురు ఉగ్రవాదులు హతం

by samatah |   ( Updated:2022-03-12 05:01:22.0  )
జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నగలుగురు ఉగ్రవాదులు హతం
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా, హంద్వారాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. రాష్ట్రంలోని కుప్వారా జిల్లాలోని హంద్వారా, పుల్వామా జిల్లాల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

పుల్వామాలో, చేవల్‌కలన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో జమ్మూకాశ్మీర్ పోలీసులు, భారత భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. భద్రతా బలగాల గాలింపు చర్యల్లో .. పాకిస్థానీతో సహా ఇద్దరు జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని హంద్వారా ప్రాంతంలోని రాజ్‌వార్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరొక ఉగ్రవాది హతమయ్యాడు. అలాగే శనివారం ఉదయం గందర్‌బాల్‌లోని సెర్చ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed