పార్లమెంట్ సాక్షిగా ఎంపీ కన్నీటి పర్యంతం.. కారణం అదేనా?

by Vinod kumar |
పార్లమెంట్ సాక్షిగా ఎంపీ కన్నీటి పర్యంతం.. కారణం అదేనా?
X

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ బిర్భూం జిల్లా మారణకాండపై ఎంపీ రూపా గంగూలీ రాజ్యసభలో కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం ఇక జీవించలేనిదిగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్లమెంట్ లో బెంగాల్ దహనకాండ గురించి ఆమె మాట్లాడారు. 'పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ సముహా హత్యలు జరుగుతున్నాయి. ప్రజలు అక్కడి నుండి పారిపోతున్నారు.


రాష్ట్రంలో ఇక జీవించడానికి లేదు. రాష్ట్రంలో ప్రజలను మాట్లాడనివ్వట్లేదు. ప్రభుత్వమే హంతకులను రక్షిస్తుంది. ఎన్నికల్లో విజయం తర్వాత ప్రజలను చంపే ఇలాంటి ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేదు' అని అన్నారు. తాము మనుషులమేనని, ఇలాంటి రాజకీయాలు చేయలేమని చెప్పారు. బిర్భూం జిల్లాలో ఎనిమిది మంది దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే కారణమంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Advertisement

Next Story

Most Viewed