అమిత్ షా ప్రకటన.. హ్యాపీగా ఫీలైన బండి సంజయ్

by GSrikanth |
అమిత్ షా ప్రకటన.. హ్యాపీగా ఫీలైన బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామన్నా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, అధ్యక్షుడు నడ్డా, అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పారు. బీజేపీకి చెప్పిన పనులు చేయడం సులభమని అన్నారు. ఒక బీసీని దేశానికి ప్రధాన మంత్రిని చేసిన ఘనత బీజేపీకి ఉందని తెలిపారు. అంతేకాదు.. అగ్రకులాల పేదలకూ రిజర్వేషన్లు అందిస్తున్నామని వెల్లడించారు. గడీలకే పరిమితమైన కేసీఆర్‌ను ధర్నా చౌక్‌కు తీసుకొచ్చిన ఘనత కూడా బీజేపీదే అని చెప్పారు. ఈసారి రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా అభివృద్ధి చెందలేదని అన్నారు.

Read More: బీజేపీ బీసీ CM ప్రకటన.. ఈటల రియాక్షన్ ఇదే..!

Advertisement

Next Story

Most Viewed