- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
మళ్లీ ఫీనిక్స్ పక్షిలాగా లేస్తాం.. ఎంపీ ఫలితాలపై KTR రియాక్షన్
దిశ, వెబ్డెస్క్: ఎంపీ ఫలితాల్లో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బోణికొట్టలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్న ఎగ్జాట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా మంగళవారం వెలువడిన ఫలితాలలో బీఆర్ఎస్ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత 24 ఏళ్లలో అనేక ఒడిదొడుకులు, మధురమైన విజయాలను చూశాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమకు అతి పెద్ద మైలు రాయి. ప్రాంతీయ పార్టీగా తాము 2014లో 119 స్థానాలకు 63, 2018లో 88 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 119 స్థానాల్లో 39 సీట్లు, అంటే ఒకటిలో మూడో వంతుతో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రోజు వెలువడిన ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. కానీ రానున్న కాలంలో బూడిదలోంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా తప్పకుండా పైకి లేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.