కొట్టుకుపోయిన వంతెన.. 42 గ్రామాలకు రాకపోకలు బంద్

by Rajesh |
కొట్టుకుపోయిన వంతెన.. 42 గ్రామాలకు రాకపోకలు బంద్
X

దిశ, కాగజ్‌నగర్ : కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి వద్ద నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. రాత్రి నుండి‌ కురుస్తున్న వర్షం కారణంగా ఈ వంతెన కోటుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని దహెగాం మండలం, కాగజ్ నగర్ మండలం మధ్య రాకపోకలకు ఏకైక ప్రత్యామ్నాయం అందవెల్లి పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జ్. ఇటీవల ఇది కుంగిపోవడంతో కొత్త బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రజల రాకపోకలకు తాత్కాలికంగా వాగులో నుంచి రోడ్డు వేశారు. వాగు ప్రవాహానికి ఆటంకం లేకుండా చూశారు. వర్షానికి ఈ తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Next Story