విద్యుత్ షాక్ తో రెండు ఆవులు మృతి

by Nagam Mallesh |
విద్యుత్ షాక్ తో రెండు ఆవులు మృతి
X

దిశ, నల్లబెల్లి : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో రెండు పాడి ఆవులు (జెర్సీ ఆవులు) మృతి చెందిన సంఘటన మండలంలోని అరిషనపల్లి శివారు లో సోమవారం చోటు చేసుకుంది. బాధిత రైతు పల్నాటి మూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఆర్షనపల్లి శివారులో మేత కోసం వెళ్ళిన ఆవులు (జెర్సీ ఆవులు) ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన పాడి ఆవుల విలువ సుమారు 1,60,000 ఉంటుందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

Next Story

Most Viewed