అంగన్వాడి కేంద్రంలో గుడ్లను ధ్వంసం చేసిన దుండగులు..

by Sumithra |
అంగన్వాడి కేంద్రంలో గుడ్లను ధ్వంసం చేసిన దుండగులు..
X

దిశ, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు అంగన్వాడీ కేంద్రం తలుపులు, తాళాలు పగలగొట్టారు. అంతే కాకుండా అందులోని రెండవ సెంటర్ లో ఉన్న ఐదువందల గుడ్లు, ఐదవ సెంటర్ లో రెండు వందల కోడిగుడ్లను చిందర వందరగా పడేసి పగలగొట్టారు. అలాగే పక్కనే ఉన్న మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలోని ప్రతి తరగతి గదిలోనూ కోడిగుడ్లను పగలగొట్టారు. మంగళవారం రోజున ఉదయం పిల్లలు బడికి వెళ్లి చూడగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు.

Next Story

Most Viewed