విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు.. బల్దియా కమిషనర్

by Sumithra |
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు.. బల్దియా కమిషనర్
X

దిశ, వరంగల్ టౌన్ : శానిటేషన్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. మంగళవారం హన్మకొండ శానిటేషన్ సర్కిల్ నెంబర్ 9 పరిధి అశోక థియేటర్ సమీపంలో గల శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం, అమృత థియేటర్ పాయింట్ వద్ద ఉదయం ఐదు గంటలకే పారిశుధ్య సిబ్బంది అటెండెన్స్ ను కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సిబ్బంది గైర్హాజరుకు గల కారణాలను, గత రెండు రోజులుగా సిబ్బంది ఎక్కడ పనిచేశారు, ఏ ఏ పనులు చేశారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైతే జీతంలో కోత విధించాలని తెలిపారు. అవుట్సోర్సింగ్ శానిటేషన్ సిబ్బంది సుదీర్ఘకాలం విధులకు రాకుంటే తొలగించాలని చెప్పారు. పిన్ పాయింట్ ప్రోగ్రాంలో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్ లకు చెత్త తొలగింపు, డ్రైన్లలో డీసిల్టేషన్, రోడ్లను శుభ్రంగా ఉంచడం సంబంధిత అంశాల పై సమగ్ర అవగాహన కల్పించాలన్నారు.

కుమార్ పల్లి ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ రెండు వైపులా డ్రైన్ ఉండగా ఒక వైపు చెత్త తొలగించకపోవడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో చెత్త రోడ్డు పై ఉండడాన్ని గమనించిన కమిషనర్ చెత్త రోడ్డు పై వేసే వారి పై లిట్టర్ పెనాల్టీలు విధించాలని సీఎంహెచ్ఓను ఆదేశించారు.

అలాగే అమృత థియేటర్ సమీపంలో అటెండెన్స్ పాయింట్ వద్ద సిబ్బంది అటెండెన్స్ ను కమిషనర్ పరిశీలించారు. అనంతరం మచిలీ బజార్ ప్రాంతంలో శానిటేషన్ తీరును పరిశీలించి నిర్వహణ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనితీరు మెరుగు పడాలని లేకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. శానిటేషన్ నిర్వహణ తీరుపై స్థానికంగా నివాసం ఉంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, సానిటరీ సూపర్వైజర్ పసునూరి భాస్కర్, సానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ జవాన్డు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed