ప్రజావాణిలో ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

by Aamani |
ప్రజావాణిలో ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్
X

దిశ,హనుమకొండ టౌన్ : సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి లో ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిష్కరించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య జిల్లా అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన వినతులను పరిశీలించిన కలెక్టర్ ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 165 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, పరకాల, హనుమకొండ ఆర్డీవోలు డాక్టర్ కె.నారాయణ, వెంకటేష్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story