టేక్మాల్ సొసైటీ చైర్మన్‌పై అవిశ్వాసం..

by Aamani |
టేక్మాల్ సొసైటీ చైర్మన్‌పై అవిశ్వాసం..
X

దిశ, టేక్మాల్: టేక్మాల్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పై అవిశ్వాసం తీర్మాన పత్రాన్ని ప్రవేశపెట్టారు. బుధవారం జిల్లా సొసైటీ అధికారి కరుణకు సభ్యులు తీర్మాన పత్రాన్ని అందజేశారు. టేక్మాల్ ప్రాథమిక సహకార సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉండగా, వీరిలో 8 మంది బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందగా, 5 మంది కాంగ్రెస్ మద్దతు గెలుపొందారు. మెజారిటీ బి ఆర్ ఎస్ పార్టీకి ఉండడంతో చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక డైరెక్టర్ మృతి చెందగా, మరో ఇద్దరు సభ్యులు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చేరడం పాటు మరొకరు మద్దతు ఇస్తున్నారు.

దీంతో బీఆర్ఎస్ పార్టీ సంఖ్య నాలుగుకి పడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్ల సంఖ్య ఏడు మందికి చేరగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరొక డైరెక్టర్ మద్దతుతో చైర్మన్ యశ్వంత్ రెడ్డి పై అవినీతి ఆరోపణలతో పాటు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన తీర్మాన పత్రాన్ని 8 మంది సభ్యులు జిల్లా సొసైటీ అధికారికి అందజేశారు. ఇందులో డైరెక్టర్ లతోపాటు జిల్లా కో ఆప్షన్ సభ్యులు యూసుఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్ , పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ, మాని కిషన్, సంగమేశ్వర్ గౌడ్, రాజేష్ , తదితరులు ఉన్నారు.

Next Story