- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పల్లెల అభివృద్ధిలో ఎంపీటీసీల పాత్ర కీలకం
దిశ, జగిత్యాల రూరల్ : ప్రజా సేవతోనే ప్రజాప్రతినిధులకు గుర్తింపు వస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండల పరిషత్ సభ్యుల వీడ్కోలు సన్మాన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజాప్రతినిదులు నిత్యం ప్రజల మధ్యన ఉంటూ వారి సమస్యలు
పరిష్కరించినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో ఎంపీటీసీల పాత్ర కీలకం అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ మాట్లాడుతూ ఎంపీటీసీ లు గ్రామాలకు ,మండల అధికారులకు మధ్య వారధి గా ఉంటారన్నారు. అనంతరం ఎంపీటీసీ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంగళారపు మహేష్, వైస్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్, పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, ఎంపీటీసీలు, ఎంపీడీఓ రమాదేవి, ఎంపీవో రవిబాబు, రూరల్ మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.