- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
నేననుకుంటే మీ అమ్మ పేరు తీసేస్తుంటీ.. మాజీ ఎమ్మెల్యే
దిశ, తాడూరు : నేను అధికారంలో ఉన్నప్పుడు మీలాగా దాతల పేర్లు తీసేయాలనుకుంటే మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలకు పెట్టిన మీ అమ్మ పేరు కే. సౌభాగ్య రెడ్డి పేరును తొలగించేటోన్నని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.. ప్రస్తుత ఎమ్మెల్యే కే.రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. బుధవారం మండల పరిధిలోని శిరీష వాడ తాడూరు గ్రామాలలో ఎంజెఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాలల నూతన భవనాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నూతన భవనాలను తన ట్రస్టు ద్వారా నిర్మించిన భవనాల ప్రారంభోత్సవానికి తనకు ఎలాంటి ఆహ్వానం పంపలేదని ఆయన తెలియజేశారు. నూతన భవనాల ప్రారంభోత్సవానికి ఆయా గ్రామాల పెద్దలను భవన నిర్మాణ దాతలను పిలవడం ఆనవాయితీ అయిన కేవలం అధికారంలో ఉన్నామని అహంతో మమ్ములను అవమానించారని ఆయన అన్నారు . కనీసం భవనం పై ఉన్న పేరును చూసి కూడా జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. అనంతరం కాసేపు ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో రాజు గౌడ్, జలీల్, రమణ, యార కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.