సీజన్‌కు సిద్ధం కండి : ఆర్ జేడీ ఎం శ్రీనివాస్

by Aamani |
సీజన్‌కు సిద్ధం కండి : ఆర్ జేడీ ఎం శ్రీనివాస్
X

దిశ, వరంగల్ టౌన్ : కొద్ది రోజుల్లో కాటన్ సీజన్ ప్రారంభం కానుందని,అందుకు అన్ని విధాల సిద్ధంగా ఉండాలని మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఏనుమముల మార్కెట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మార్కెటింగ్ శాఖ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సీజన్ లో ప్రభుత్వ నిర్ణయించిన కనీస మద్దతు ధరతోనే రైతుల సరుకులను కొనుగోలు చేసేలా చూడాలని అన్నారు.

మార్కెట్ లకు సరుకులతో వచ్చే రైతులకు, వ్యాపారస్తులకు మౌలిక సదుపాయాలకు ఎలాంటి లోటు రానీయకుండా చూసుకోవాలి సూచించారు. త్రాగు నీరు , లైటింగ్ ఏర్పాట్లతో పాటు మరుగు దొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. యార్డు క్లీనింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీదు దారుల నుంచి ప్రతి నెల కొనుగోలు నివేదికలు తీసుకుంటూ మార్కెట్ ఫీజు వసూలు చేయాలని, కాంటాలను తనిఖీ చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చూసుకోవాలి అన్నారు. కార్యక్రమంలో డీడీఎం పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి కె సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శలు, పర్యవేక్షకులు ఇతర మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed