కౌశిక్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరింది : ఎంపీ మల్లు రవి

by M.Rajitha |
కౌశిక్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరింది : ఎంపీ మల్లు రవి
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పిచ్చి పరాకాష్టకు చేరిందని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ పదవి కాళ్లుపట్టుకొని తెచ్చుకున్నాడని సీఎంపై వ్యాఖ్యనించడం సరికాదన్నారు. కౌశిక్ మతి స్థిమితం కోల్పోయాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గురించి తెలిసిన వారేవ్వరూ ఇలాంటి ప్రకటనలు చేయరన్నారు. తీవ్రమైన ప్రతికూల పరిస్థితులలో ఉన్నప్పటికీ, పార్టీని పవర్ లోకి తీసుకువచ్చాడన్నారు. జడ్పీటీసీ నుంచి సీఎం వరకు ఆయన స్వతహాగా ఎదిగారన్నారు. ఉద్యమాలు చేసి పదవులు పొందాడన్నారు. విభిన్నమైన నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతున్నాడన్నారు. కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేసే బాధ్యత ఆ పార్టీపై ఉంటుందన్నారు. తుపాకీ రాముని వలే వ్యవహరిస్తే, కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed