మోడీ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by M.Rajitha |
మోడీ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రక్తదానం చేశారు. ప్రధాని మోడీ 74వ పుట్టినరోజు సందర్భంగా నిర్మల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఆయన బ్లడ్ డొనేట్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దేశ ప్రజల జీవితాలను సంతోషంగా ఉంచేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రధాని మోడీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed