దసరా ఉత్సవాలను చిత్రీకరిస్తుండగా రిపోర్టర్ పై దాడి..!

by Sumithra |
దసరా ఉత్సవాలను చిత్రీకరిస్తుండగా రిపోర్టర్ పై దాడి..!
X

దిశ, నల్లబెల్లి : విధుల్లో ఉన్న రిపోర్టర్ పై ఓ వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. నల్లబెల్లి మండలానికి చెందిన దిశ రిపోర్టర్ సట్ల రమేష్ దసరా ఉత్సవాలలో భాగంగా వార్త కవర్ చేయడానికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన మామిడి అమరేందర్ అనే వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా రిపోర్టర్ పై దాడి చేశాడు. ఈ క్రమంలో రిపోర్టర్ కి మెడ భాగంలో గాయాలు అయ్యాయి. ఈ ఘటన పై స్థానిక నల్లబెల్లి పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story