'అక్రమ పట్టాను రద్దు చేయండి'.. సర్పంచ్ కుమారుడిపై తహాశీల్దార్‌కు ఫిర్యాదు

by Vinod kumar |
అక్రమ పట్టాను రద్దు చేయండి.. సర్పంచ్ కుమారుడిపై తహాశీల్దార్‌కు ఫిర్యాదు
X

దిశ, జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ దొరగోళ్ళ ఐలమ్మ కుమారుడు యాదగిరి తన భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నాడని ఆరోపిస్తూ శనివారం స్థానిక తహాశీల్దార్ యుగంధర్ కు బాధిత రైతు గాజులపాటి అంజయ్య ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 386లో 3.22ఎకరాల భూమి ఉంది. ఇది అంజయ్యకు వారసత్వంగా సంక్రమించింది. ఇందులో నుండి 2.07 ఎకరాలు అంజయ్య కుటుంబ సభ్యులు పట్టా చేయించుకున్నారు. మిగతా భూమి వారి దాయాదులది కాగా, ఆర్థిక స్థోమత లేక సదరు భూమిని పట్టా చేసుకోలేకపోయారు.

దీనిపై కన్నేసిన యాదగిరి మరొకరితో కలిసి 2021, ఏప్రిల్ 3న తన అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా పట్టా చేసుకుని తిరిగి అదే భూమిని తన కుమారుడైన దొరగొల్ల మల్లేష్ పై బదిలీ చేసినట్లు బాధితులు వాపోయారు. అక్రమంగా తమ భూమిని పట్టా చేయించుకున్న యాదగిరి పై చట్టపరంగా తగిన చర్యలు తీసుకొని, తక్షణమే ఆ పట్టాను రద్దు చేయాలని బాధితులు కోరారు. తీహాశీల్దార్ కు ఫిర్యాదు చేసిన వారిలో చీమలపాటి రవీందర్, గాజులపాటు మైసరావు, కిషన్ రావు, యాదగిరి, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed