విఘ్నేశ్వరుని దయతో విఘ్నాలన్ని తొలగాలి : ఎమ్మెల్యే హరీష్ రావు

by M.Rajitha |
విఘ్నేశ్వరుని దయతో విఘ్నాలన్ని తొలగాలి : ఎమ్మెల్యే హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకొని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది.. పూజించేది విగ్నేశ్వరున్నే అని, విగ్నేశ్వరుని అనుగ్రహముతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఆకాంక్షించారు. ఎలాంటి విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించారు. ప్రతి ఇంటిలో మట్టి గణపతి ప్రతిమను పూజించాలన్నారు. పర్యావరణహిత మట్టి గణపతిని పూజించడం ఎంతో శ్రేష్టమని "మట్టి గణపతే మహా గణపతి" అని అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని గణ నాధున్ని ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తి శ్రద్ధలతో వినాయకున్ని ప్రార్థించి దేవ దేవుని అనుగ్రహం పొందాలని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed