హీరోయిన్ రష్మిక మందన్నకి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Mahesh |   ( Updated:2024-10-16 15:00:52.0  )
హీరోయిన్ రష్మిక మందన్నకి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: మంగళవారం భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నియమించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మనం డిజిటల్ (Digital) యుగంలో జీవిస్తున్నాము. అలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్ (Cybercrime) అత్యధిక స్థాయిలో ఉంది. నా డీప్ ఫేక్ వీడియో ని క్రియేట్ చేసి బాగా వైరల్ చేశారు. ఆ ఫేక్ వీడియో ని వైరల్ చేశారు. ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను భారత ప్రభుత్వం (Government of India)తో కలిసి పని చేస్తున్నానని ఓ వీడియోను విడుదల చేసింది. కాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌ రష్మిక మందన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దేశంలో సైబర్ భద్రతకు జాతీయ అంబాసిడర్‌గా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో సరైన అవగాహన కల్పించడంలో మీ నియామకం ఉపయోగపడుతుందని అభిలషిస్తున్నాను. తన ట్వీట్ లో కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.

Advertisement

Next Story