8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

by karthikeya |
8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ హాస్టల్లోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే ఘటన సమాచారం అందగానే అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed