CM చంద్రబాబుతో ఇద్దరు BRS ఎమ్మెల్యేల భేటీ

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-07 12:47:35.0  )
CM చంద్రబాబుతో ఇద్దరు BRS ఎమ్మెల్యేల భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌లు సోమవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన మనుమరాలి వివాహానికి రావాలని చంద్రబాబును మల్లారెడ్డి ఆహ్వానించారు. మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు మల్లారెడ్డి అందించారు. అనంతరం హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరారు.

ఇదిలా ఉండగా.. చంద్రబాబుతో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు గంటపాటు చర్చించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. వారితో పాటు హైదరాబాద్‌ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి కూడా భేటీ అయ్యారు. భేటీ తర్వాత తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు కూడా బీఆర్ఎస్‌లు కూడా త్వరలోనే బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. తెలంగాణ టీడీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed