'సర్కార్ ​ఆఫీసులు సరే.. పేదల డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు ఏవీ?'

by Vinod kumar |   ( Updated:2023-06-05 16:33:21.0  )
సర్కార్ ​ఆఫీసులు సరే.. పేదల డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు ఏవీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పరిపాలన సౌలభ్యం కొరకు సర్కార్​ ఆఫీసులను శరవేగంగా ఓపెన్ చేస్తున్నప్పటికీ, డబులు బెడ్​లపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు శాంతి భద్రతల కోసం పనిచేయట్లేదన్నారు. కేవలం కేసీఆర్​కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు.

కాంగ్రెస్​ తప్పకుండా పవర్​లోకి వస్తుందని, పరిపాలనలో మార్పులు తీసుకువస్తామని మల్లు రవి పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న కార్యాలయాలు ప్రజల సమస్యలను తీరుస్తున్నాయా..? అంటూ ఫైర్​అయ్యారు. ముఖ్యంగా ధరణి సమస్యలు, నిరుద్యోగం సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురి తప్పదని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed