తెలంగాణలో తొలి ఉద్యోగం పొందిన ఆ యువతి జీతం ఎంతో తెలుసా?

by Hamsa |
తెలంగాణలో తొలి ఉద్యోగం పొందిన ఆ యువతి జీతం ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన దివ్యాంగురాలైన రజిని రేవంత్ రెడ్డిని కలిసింది. తనకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఎక్కడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను ఆయనతో వ్యక్తపరచింది. దానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తానని హామి ఇచ్చారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును ఓడించి హస్తం జోరులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డి ఎల్బీస్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే దివ్యాంగురాలైన రజినీకి ఉద్యోగం కల్పిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. అలాగే ఆమెకు అగ్రికల్చర్ అండ్ కోపరేషన్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం రజినీకే ఇవ్వడంతో అందరి దృష్టి ఆమె వైపుకు మళ్లింది. అయితే తెలంగాణ రాష్ట్ర విత్తన, సెంద్రీయ ధ్రువీకరణ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఆమె విధులు నిర్వర్తించనుంది. అయితే ఆమె జీతంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రజిని నెలకు రూ. 50 వెల వేతనం అందుకోనుట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన వారు రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story