- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారనే.. వీడిన ఇద్దరు యువకుల మర్డర్ మిస్టరీ
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో సంచలనం రేపిన ఇద్దరు యువకుల జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అయితే వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడమే మర్డర్కు కారణమని తెలిసింది. జల్కం రవి ఈ నెల 4న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని వాటిని తమ గ్రామ గ్రూప్లో షేర్ చేశాడు. దీనిపై శేషిగారి శివగౌడ్ (24), గుండెమొని శివ (29) తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంతటితో ఆగకుండా గ్రూప్ నుంచి జల్కం రవిని రిమూవ్ చేశారు. ఇదే విషయమై మాట్లాడుకుందామని రవి, రాజుగౌడ్ ఆ యువకులను వెంచర్లోని ఆఫీసుకు పిలిచారు. అక్కడ మద్యం సేవిస్తుండగా తన ఫొటోస్ ఎందుకు డిలీట్ చేశారని అడిగాడు. గ్రూప్ నుంచి తనను రిమూవ్ చేయడానికి కారణాలు చెప్పాలంటూ ప్రశ్నించారు. దీంతో మాట మాట పెరిగింది. ఇద్దరు యువకులపై రవి, రాజుగౌడ్ కత్తులతో దాడి చేసి నరికి చంపినట్లు తెలిసింది. అయితే వాట్సాప్ గ్రూప్ నుంచి డిలీట్ చేయడంతో హత్యకు పాల్పడినట్లు తెలియడంతో స్థానికంగా ఈ హత్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.