- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
గాంధీభవన్లో మొదటి రోజు ముగిసిన కురియన్ కమిటీ సమావేశం
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్ : పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్పై కాంగ్రెస్ హై కమాండ్ నియమించిన కురియన్ కమిటీ సమావేశం గాంధీభవన్లో మొదటి రోజు ముగిసింది. కమిటీ సభ్యులు ఎంపీలు, ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించారు. కలెక్ట్ చేసిన వివరాలను కురియన్ కమిటీ సభ్యులు నమోదు చేసుకున్నారు. బీజేపీకి తెలంగాణలో సీట్లు ఎలా పెరిగాయన్న అంశాలపై కురియన్ కమిటీ దృష్టి సారించింది. మహబూబ్నగర్, మెదక్లో జరిగిన పరిస్థితులపై కురియన్ కమిటీ ఆరా తీసింది. రేపు జిల్లాల వారీగా కురియన్ కమిటీ సమీక్ష నిర్వహించనుంది. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కురియన్ మాట్లాడుతూ.. అందరితో మాట్లాడి.. అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. రేపు కూడా సమావేశం కొనసాగుతుందన్నారు.
Advertisement
Next Story