మాజీ గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టిన 7 బిల్లులకు ఆమోదం తెలిపిన ఇన్‌ఛార్జ్ గవర్నర్

by Mahesh |
మాజీ గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టిన 7 బిల్లులకు ఆమోదం తెలిపిన ఇన్‌ఛార్జ్ గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన 7 బిల్లును మాజీ గవర్నర్ తమిళిపై సౌందర్య రాజన్ పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. కాగా ప్రస్తుతం ఆమె తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును ఇన్‌ఛార్జ్ గవర్నర్ రాధా కృష్ణన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్ట సవరణపై 3 బిల్లులతో పాటు, ప్రైవేటు యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మైనారిటీ కమిషన్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed