TG Assembly: బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నా.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సెటైర్లు

by Shiva |
TG Assembly: బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నా.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభా సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీచ్ ఆరంభంలోని బీఆర్ఎస్ నేతలపై సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండాలు గ్రామ పంచాయతీలు రూపాంతరం చెందినా.. అక్కడ మౌలిక వసతుల కల్పన జరగలేదన్నారు. ఓ తండాకు రోడ్డు ఉంటే కరెంట్ సౌకర్యం లేదని, కరెంట్ ఉంటే తాగు‌నీరు లేదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని తాండాలు, గూడెలపై పూర్తి నివేదికను తయారు చేశామని అన్నారు. సుమారు 7 లక్షల తాండాలు, గూడెల్లో నేటికీ తాగునీరు, కరెంట్, మంచినీటి సదుపాయాలు లేవనే విషయాన్ని సీఎం సభ దృష్టికి తీసుకొచ్చారు. కానీ, బీఆర్ఎస్ నాయకులు అన్ని తండాల్లో వసుతులు కల్పించామని అబద్ధాలు చెబుతూ వచ్చారని ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఓడించినా.. వారి తీరు ఏమాత్రం మారలేదని అన్నారు. ఇకనైన బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు.

Advertisement

Next Story

Most Viewed