బండి సంజయ్ క్యాంప్ ఆఫీసు ముట్టడి.. హైటెన్షన్!

by Rajesh |
బండి సంజయ్ క్యాంప్ ఆఫీసు ముట్టడి.. హైటెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌లో బండి సంజయ్ క్యాంప్ కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడకపోవడంపై నిరసన తెలిపారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళనకారులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇక, ఇదే డిమాండ్‌తో శనివారం కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story