మలేషియాలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సాంకేతిక బృందం..

by Kalyani |
మలేషియాలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సాంకేతిక బృందం..
X

దిశ, మోత్కూరు: తెలంగాణలో ఆయిల్ ఫెడ్ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్యర్యంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సాంకేతిక బృందం మలేషియాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గురువారం మలేషియా ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్ జీవీ కంపెనీ యొక్క సీడ్ గార్డెన్, నర్సరీలను సందర్శించి పరిశీలించారు. సీడ్ గార్డెన్ లో కొత్తరకం విత్తనాల ఉత్పత్తిని పరిశీలించి, నర్సరీలో మొక్కల పెంపకానికి సంబంధించి షెడ్ నెట్లలో విత్తనాలు నాటినప్పటి నుంచి రైతులకు మొక్కలు ఇచ్చే వరకు వాటి సంరక్షణలో తీసుకుంటున్న మెలకువలను తెలుసుకున్నారు. అనంతరం మలేషియా సాంకేతిక నిపుణులతో సమావేశమై సీడ్ గార్డెన్ లో ఉన్న విత్తనాల రకాలు వాటి పెరుగుదల, దిగుబడులు వాటి జీవితకాలపు వివరాలను సమీక్షించారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, మేనేజర్లు జెన్ను సత్యనారాయణ, శ్రీకాంత్ రెడ్డి, బాలకృష్ణ, కల్యాణ్, నాగబాబు, పవన్, ఎఫ్ జీవీ ప్రతినిధులు సత్యనారాయణ, శాంసుల్, నూరిజాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed