నిన్న సభకు వచ్చింటే బాగుండేది.. కేసీఆర్ కు శ్రీధర్ బాబు కౌంటర్

by Prasad Jukanti |
నిన్న సభకు వచ్చింటే బాగుండేది.. కేసీఆర్ కు శ్రీధర్ బాబు కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో:కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు కూడా అసెంబ్లీలో ఉండకుండా హడావుడిగా బయటకు వెళ్లి మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెడితే ఎలా అని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా విని ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కేసీఆర్ కు అర్థమయ్యేదన్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు చెప్పడంతో హడావుడిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని, అంతే హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు ఇంతే హడావుడిగా కేసీఆర్ వస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు రెస్ట్ తీసుకోమని ప్రజలు సమయం ఇచ్చారని సెటైర్ వేశారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల ఫ్రెండ్లీ బడ్జెట్ అని అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత దక్కిందన్నారు.



Next Story