శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కీలక ప్రకటన

by M.Rajitha |
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 15 నుండి వారం రోజులపాటు ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, విమాన ప్రయాణాలు చేసేవాళ్ళు కాస్త ముందుగా విమానాశ్రయానికి చేరుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవవని ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏడూ రాఖీ పండుగ సందర్భంగా ప్యాసింజర్ల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ ఏడాది కూడ అలాగే ఉంటుందని అంచనా వేస్తూ ఈ సూచన చేస్తున్నట్టు పేర్కొంది. ఎవరైతే ఆగస్ట్ 15 నుండి 19 మధ్య ఎవరైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారో వారు ఫ్లైట్ సమయానికంటే ముందుగానే చేరుకొని, విమానాశ్రయ సిబ్బందికి సహకరించాలని కోరారు.

Next Story