- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
కేటీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్
దిశ, గంభీరావుపేట: సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడం లేదని గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కోడె రమేశ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నాయని అన్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకునే తీరిక మాత్రం తమ ఎమ్మెల్యే కేటీఆర్కు లేకుండా పోయిందని మండిపడుతున్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్లను గాలికి వదిలేయడం కరెక్ట్ కాదని అన్నారు. మూడు మండలాలకు ప్రధాన రహదారి అయిన గంభీరావుపేట మండలం పరిధిలోని లింగన్నపేట వాగుపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. గతంలో ఆర్భాటం చేశారు కానీ, బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదని విమర్శించారు. కాంట్రాక్టర్తో కుమ్మక్కై నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. దీంతో తమ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు విషయమై స్థానిక ఎస్ఐ శివకుమార్ను వివరణ కోరగా ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే అని తెలిపారు.